T20 IND VS PAK: T20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచింది. ముందుగా టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకావడంతో పాకిస్తాన్ 20 ఓవర్లకు 159/8.. పరుగులు చేయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత్ మ్యాచ్ చివరి బంతి వరకు ఆడి నిర్దేశించిన పరుగుల కంటే మరో నాలుగు పరుగులు అత్యధికంగా 163 చేసి విజయం సాధించింది. లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ లో ఛేదించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా లాస్ట్ రెండు ఓవర్ లలో విరాట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి బౌలర్లపై టెన్షన్ పెట్టించడంలో… పరుగులు సాధించడంలో చాలా తెలివిగా గేమ్ ఆడాడు. పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మొత్తం 82 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. హార్థిక్ పాండ్యా 40 పరుగులు సాధించారు. ఇంకా ఓపెనర్స్ రోహిత్ నాలుగో పరుగులు, రాహుల్ కూడా నాలుగు పరుగులు సాధించడం జరిగింది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 15 పరుగులు.. నెక్స్ట్ అక్షర పటేల్ రెండు పరుగులు, దినేష్ కార్తీక్ ఒక పరుగు చేసి ఔట్ అయ్యారు.
అయితే జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఈ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ చేయటంతో ఐసిసి T20 టోర్నీలో.. అత్యధిక ఆఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత సచిన్ (23)ఆఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు T20లో అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ (3741) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ(3783) పరుగులు చేసి బ్రేక్ చేయడం జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై మ్యాచ్ గెలవటంతో… క్రికెట్ ప్రేమికులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!