IND vs PAK: ఆదివారం T20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంచలనం రేపింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా చూస్తూ ఉంటారు. విపరీతమైన క్రేజ్ ఉంటది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో అనేది చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రీతిలో మ్యాచ్ కొనసాగింది. కానీ చివర ఆఖరికి ఇండియా విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.
స్టార్టింగ్ లో ఓపెనర్స్ కుప్ప కూలిపోవడంతో ఇండియాన్ ప్లేయర్స్ ఒత్తిడికి గుర్రయారు. ఇటువంటి క్లిష్ట సమయంలో భయంకరమైన ఒత్తిడిలో.. హార్దిక్ పాండ్యతో కలిసి విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ అయింది. 53 బంతులలో 82 పరుగులు చేశాడు విరాట్. చివరి 3 ఓవర్లలో విరాట్ ఆడిన ఆట తీరు.. ప్రత్యర్థి జట్టు పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. నిన్న మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా 90 వేల మంది చూశారు.
హాట్ స్టార్ లో ఏకంగా కోటి ఏనాబై లక్షల మంది వీక్షించడం జరిగింది. యాప్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యూయర్ షిప్. మ్యాచ్ స్టార్ట్ అయిన సమయంలో 36 లక్షల మంది యాప్ లో చూస్తుండగా.. ఫైనల్ బాల్ కి ఆ సంఖ్య 1.80 కోట్లకు చేరింది. మొన్న జరిగిన ఆసియా కప్ లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ నీ .. కోటి 40 లక్షల మంది వీక్షించారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో దాటేయటం విశేషం.
Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!