కలుషిత ఆహారం కారణంగా దాదాపు 28 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్దినులు విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడటంతో వీరబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్ధినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయచోటి ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో ఆహారం కలుషితం కావడం వల్లనే విద్యార్ధినులు అస్వస్థతకు గురైనట్లుగా భావిస్తున్నారు.
తమ పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో పలువురి విద్యార్ధినుల తల్లిదండ్రులు, కస్తూరిబా పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో బెడ్ లు ఖాళీ లేకపోవడంతో ఒక్కో బెడ్ ను ఇద్దరిద్దరు విద్యార్ధినులకు కేటాయించి సెలైన్ బాటిల్స్ ఎక్కించి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
Rahul Gandhi: మహాసర్కార్ కు రాహుల్ గాంధీ సవాల్
As many as 28 girl students fell ill and shifted to hospital, students had complained of issues like diarrhea, stomach pain, due to #FoodPoisoning at a govt run Kasturba Gandhi Balika Vidyalaya (#KGBV) at #Veeraballi area in #Annamayya dist.#AndhraPradesh #foodpoison #Students pic.twitter.com/VWBNSi3fJQ
— Surya Reddy (@jsuryareddy) November 17, 2022