AP Police: ఏపి ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఒకే సారి 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఇంత మందిని ఒకే సారి బదిలీ చేయడం ఈ ఏడాది ఇదే ప్రధమం. గత ఏడాది నవంబర్ నెలలో దాదాపు ఏడాది పాటు విఆర్ లో ఉన్న సుమారు 17 మంది డీఎస్పీలకు మొక్షం కల్గిస్తూ 53 మందిని బదిలీ చేయగా, ఈసారి విఆర్ లో ఉన్న 24 మంది డీఎస్పీలకు వేర్వేరు చోట్ల పోస్టింగ్ లు ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీలతో పాటు పోస్టింగ్ వచ్చినటువంటి అధికారులు తక్షణం విధుల్లో చేరాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు డీఎస్పీగా చేరిన రెండు రోజుల్లోనే అశోక్ వర్థన్ ను మళ్లీ బదిలీ చేసి దర్సి డీఎస్పీగా నియమించారు. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి నియమితులైయ్యారు. కనిగిరి డీఎస్పీగా రామరాజును నియమించగా, అమలాపురం ఎస్డీపీఓగా అంబికా ప్రసాద్, ఎసీబీ డీఎస్పీగా ఉన్న ఎస్ఆర్ కే ప్రసాద్ ను రామచంద్రాపురం ఎస్డీపీఓగా, మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ ను రామచంద్రాపురం ఈస్ట్ డీఎస్పీగా బదిలీ చేశారు.