NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

5000 కోట్ల రూపాయ‌లు…. ఒక్క చోటే జ‌గ‌న్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు త‌న‌దైన శైలిలో వార్త‌ల్లో నిలిచారు. త‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి నిర్ణ‌యం అయినా తీసుకునే నేత‌గా ఆయ‌న మరోమారు నిరూపించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైయస్సార్‌ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రెండో రోజు పులివెందులలో పర్యటించారు.

 

భాకరాపేట వద్ద కొత్తగా బస్సు డిపో, బస్‌ స్టేషన్‌ నిర్మాణంతో పాటు, నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను కొత్త బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఆవిష్కరించారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అనంత‌రం పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం జ‌గ‌న్ ఏమంటున్నారంటే ….

పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనిదని సీఎం జ‌గ‌న్ అన్నారు. “దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో మరో రూ.5 వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇక్కడి ప్రజలు సొంత కొడుకులా, బిడ్డలా ఆదరిస్తున్నారు. ఏరోజూ తక్కువ చేయలేదు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ` అంటూ సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. “గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌), పైడిపాలెం జలాశయాలు నింపేందుకు రూ.3 వేల కోట్లతో లిఫ్ట్‌ ప్రాజెక్టులు చేప‌డుతున్నాం. ఈ నెల 26న టెండర్లు అప్‌ లోడ్‌. మార్చికల్లా పనులు మొదలు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయం దాదాపు రూ.4300 కోట్లు.“ అని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు.

శ్రీశైలం – పోతిరెడ్డిపాడు గురించి….

‘శ్రీశైలంలో నీరు క్రమంగా తగ్గుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీరు వస్తేనే మనకు నీరు. పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు డ్రా చేయడం (ఫుల్‌ డిశ్చార్జ్‌ కెపాసిటీ) శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే సాధ్యం అవుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో నీరు 854కు పడిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలుగుతాం.గత 15 ఏల్లలో కేవలం 25 రోజులు కూడా 881 అడుగుల నీరు లేదు’. ‘మనకు వర్షాలు తక్కువ. నీరు వచ్చినప్పుడే నిల్వ చేసుకోవాలి. మన డ్యామ్‌లలోకి నీరు వేగంగా చేరితేనే లాభం. అందుకే ఈ చర్యలు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు 40 రోజులు ఉంటే, మన డ్యామ్‌లు నిండుతాయి. అందుకే ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు. ఈ సమయంలోనే ఫలానాది చేయగలుగుతాము అని చేసి చూపించాము. మనసు పెడితే, చిత్తశుద్ది ఉంటే రైతులకు ఎలా మేలు చేయవచ్చన్నది చేసి చూపాం’ అని సీఎం జ‌గ‌న్ అన్నారు.

author avatar
sridhar

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju