రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంతో మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పోలీస్ ఉద్యోగార్దులకు గుడ్ న్యూస్ అందిస్తున్నది. రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానున్నది. ప్రతి ఏటా 6,500 నుండి ఏడు వేల వరకూ పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయాలని కొద్ది నెలల క్రితం సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీకి నోటిపికేషన్ ను ఖరారు చేసింది. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తి చేయనున్నది. వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుడ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నది. ఎంపికైన అభ్యర్ధులు 2023 జూన్ లో పోలీస్ శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీస్ శాఖలో పోస్టులు ఇవ్వనున్నారు.
పోస్టుల వివరాలు ఇవి
ఎస్ ఐ (సివిల్) 387
ఎస్ ఐ (ఎపిఎస్పీ) 96
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,508
ఎపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్) 2,520
YSRCP: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పేసిన మరో సీనియర్ నేత