ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, ప్రముఖ హస్యనటుడు ఆలీ సంచలన వ్రకటన చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి తాను సిద్దమని ఆలీ పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేస్తానని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం రాజకీయాల్లో సాధారణమని అన్నారు. ఇండస్ట్రీ పరంగా పవన్ తనకు మంచి స్నేహితుడని, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని అన్నారు ఆలీ. మంచి చేసే వారినే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోజాను పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి అంటూ విమర్శించడంపై వ్యాఖ్యానిస్తూ నిజంగా రోజమ్మ కోహినూర్ డైమండ్ తో సమానమని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన సందర్భంలో ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికలకు ముందు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో చేరి ప్రచారంలో పాల్గొన్న ఆలీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో నాడు భేటీ కావడంతో ఆలీ జనసేనలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా వైసీపీ లో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి ఏదైనా నామినేటేడ్ పదవి ఖాయమని అనుకున్నారు. వాస్తవానికి ఆలీ గుంటూరు జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాలని ఆయన ఆకాంక్షగా ఉంది. ఓ టీవీ కార్యక్రమంలో తన మనసులో మాట ఎన్నికలకు ముందు చెప్పారు అలీ. అయితే వైసీపీలో ఆయన ఎన్నికల ప్రచారానికే పరిమితం అయ్యారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అంటూ పలు పదవులు ఆలీకి వరిస్తాయంటూ ప్రచారం జరిగింది. కానీ చివరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది.
ఏపి సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వాళ్లకు సంక్షేమ పథకాలు అందుతాయోచ్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?