NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rahul Gandhi: త్వరలో ఏపికి రాహుల్ గాంధీ..! ఎందుకంటే..?

Rahul Gandhi: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ త్వరలో ఏపికి రానున్నారు. ఏపి ప్రస్తుతం ఒక పక్క అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరో పక్క విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళనల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. నవ్యాంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో అత్యధికులు వైసీపీ లోకి వెళ్లడంతో ఆ పార్టీ క్యాడర్ కూడా వైసీపీకి మళ్లింది.

Aicc leader Rahul Gandhi ap tour
Aicc leader Rahul Gandhi ap tour

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ నాయకత్వం యోచన చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పీసీసీ) అధ్యక్షుడి మార్పునకు చర్యలు తీసుకోనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంకు నైతిక బాధ్యత వహించి రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేయగా ఏఐసీసీ ఆయన స్థానంలో సాకే శైలజానాధ్ ను పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే శైలజానాధ్ బాధ్యతలు అప్పగించిన తరువాత కూడా పార్టీ కార్యక్రమాలు ఊపందుకోలేదు.

Rahul Gandhi: పీసీసీకి కిరణ్ కుమార్ రెడ్డి విముఖత

ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉండి వాగ్దాటి ఉన్న గట్టి నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తున్నది. ఈ క్రమంలో భాగం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ యోచన చేయగా ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే రెడ్డి లేదా కాపు సామాజిక వర్గ నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు పార్టీలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ, అమరావతికి రాహుల్ గాంధీ

ఈ తరుణంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్న రాహుల్ గాంధీ త్వరలో రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాహుల్ గాంధీ అమరావతిలో రైతుల ఉద్యమానికి, విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలుకుతారని చెప్పారు. మూడు రాజధానులపై జగన్ తొందరపాటు చర్య తీసుకున్నారని చింతా మోహన్ అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ఆశాభావం వ్యక్తం చేసిన చింతా మోహన్ రాష్ట్రంలో త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. తాను మాత్రం పీసీసీ రేసులో లేనని స్పష్టం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju