Akhila priya భూమా అఖిల ప్రియ … తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన తెలుగుదేశం మాజీ మంత్రి, ఆళ్లగడ్డ నేత.
ఈ కిడ్నాప్ అంశంలో తమపై కుట్ర జరిగిందని భూమా కుటుం సభ్యులు పేర్కొంటుండగా మరోవైపు అఖిలప్రియ పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్టు చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే, జైలు నుంచి విడుదలైన అనంతరం అఖిలప్రియ మౌనం వహించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Akhila priya : విడుదలైన రోజే….
బోయినపల్లి కిడ్నాప్ కేసులు అరెస్టు అయి, అనంతరం హైదరాబాద్ లోని చంచల్ గూడా జైలు నుంచి విడుదలయిన సందర్భంగా ఆమె సన్నిహితులు కీలక ప్రకటన చేశారు. జైలు నుంచి విడుదలైన అఖిలప్రియకు ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం చంచల్ గూడా జైలు నుంచి నేరుగా అఖిలప్రియ ఆమె నివాసానికి వెళ్లారు. మరుసటి రోజు అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారని ఆమె సన్నిహితులు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో అరెస్టుకు సంబంధించిన అన్ని విషయాలను, కిడ్నాప్ కు సంబంధించిన విషయాలను, ల్యాండ్ గురించి విషయాలను అఖిల ప్రియా మీడియాతో పంచుకోబోతున్నారని తెలిపారు. అయితే, విడుదలై దాదాపు ఆరు రోజులు అవుతున్నా అఖిలప్రియ మీడియా ముందుకు రావడం లేదు.
పోలీసుల విచారణే కారణమా?
కస్టడీ సందర్భంగా జరిగిన పరిణామాలే అఖిలప్రియ మౌనానికి కారణమని అంటున్నారు. అఖిలను 3 రోజుల పాటు విచారించిన పోలీసులు 300లకు పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగింది ? ఎవరెవరు పాల్గొన్నారు ? ఎలా స్కెచ్ వేశారు ? కాస్టూమ్స్ నుంచి ఎస్కేప్ వరకు ఎలా వ్యూహం రచించారు ? ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఎవరు ఏ రోల్ పోషించారో తెలిసిపోయింది. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి అఖిలకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు పక్కాగా ఉండడంతో ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్ గూడా మహిళా జైలుకు పోలీసులు తరలించారు . మరోవైపు ఇప్పటికీ అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. ఇంకా ఆయనకు బెయిల్ దొరకలేదు. భార్గవ్ రామ్ కు బెయిల్ దొరికిన అనంతరమే అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతారని అప్పటివరకు మౌనంగానే ఉంటారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?