Akkineni Nagarjuna: సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితంపై గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమని తేలిపోయింది. తామిద్దరం వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామని స్వయంగా సమంత, నాగ చైతన్య దంపతులు సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఈ వార్తతో అభిమానులు అందరూ షాక్ గురైయ్యారు. మరో వైపు ఈ అంశంపై నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున స్పందించారు. బావోద్వేగంతో నాగ్ ట్వీట్ చేశారు. “బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా, సమంత, నాగ చైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేది వ్యక్తిగతం, వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైన వాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగ చైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా” అని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు.
Akkineni Nagarjuna: నెటిజన్స్ ఏమంటున్నారంటే..
నాగ్ ట్వీట్ పై నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పది సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు నాలుగు సంవత్సరాలు కలిసి ఉండలేకపోయారు దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారా, అభిమానులకు బాధగానే ఉంటుంది కానీ వారిద్దరి నిర్ణయాన్ని కూడా మనం గౌరవించాలి, సమాజానికి ఏమ్ మెసేజ్ ఇస్తున్నారు సార్, పెద్ద వాళ్లు మీరు నచ్చ చెప్పాలి కదా సార్, ముచ్చటగా వుండే జంట, విడిపోయారు అంటే వినడానికి కష్టంగా వుంది, చైతు లాంటి ఫర్పెక్ట్ పర్సన్ వదులుకోవడం దురదృష్టం అనుకోవాలి..బంధాలు విలువ ఇప్పుడు తెలీదు వాటి విలువ ముసలితనం లో తెలుస్తాయి, ఇలా రకరకాలుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా వాళ్ల పెళ్లిళ్ళు ఇలానే ఉంటాయి అని చెడు అభిప్రాయం కలిగి ఉన్న వారికి, వీరి విడాకులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అంటూ కూడా వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
చై..సామ్ ప్రకటన ఇదీ
నాగ చైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా తాము విడాకులు తీసుకోనున్నట్లు నేడు ప్రకటించారు. “ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుండి మేం భార్య – భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక నుండి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.