Supreme Court: సుప్రీం కోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురైంది. ఆర్ 5 జోన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దంటూ రాజధాని రైతులు వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర ప్రాంత పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేమిటి, రాజధాని అందరిది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే హైకోర్టు తీర్పను రాజధాని రైతులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రైతులు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ధర్మాసనం సీజేఐకి రిఫర్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
అమరావతి పై పిటిషన్లు విచారణను మరో ధర్మాసనం విచారిస్తొందనీ, అలాంటప్పుడు తాము విచారించడం సరికాదని అభిప్రాయపడింది. అమరావతి ప్రధాన కేసుతో పాటు ఆర్ 5 జోన్ నూ కలిపి విచారించడమే సబబని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతుల పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం లోపు ఈ పిటిషన్లపై విచారణకు సంబంధించి ధర్మాసనం ముందు లిస్ట్ చేసేందుకు అనుగుణంగా సీజేఐ నుండి తగిన సూచనలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెండు పిటిషన్లు ఒకే ధర్మాసనం విచారించాల్సి ఉన్నందున ఆ మేరకు వ్యవహరించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా సూచించారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని దాదాపు 50వేల మంది పేదలకు అమరావతి రాజధాని పరిధిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం యుద్ద ప్రతిపదికన చర్యలు చేపట్టింది. ఈ చర్యలను అమరావతి రైతులు అడ్డుకుంటూ ఉన్నారు. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ కేసును రాజధాని కేసులను విచారించే ధర్మాసనానికి బదిలీ చేసింది. అమరావతి రైతుల పిటిషన్ నేపథ్యంలో ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరో సారి పిలుపు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?