Ambati Rambabu: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులలో కొందరు ఒక్కో సారి అనాలోచితంగానో, ఆవేశంలోనో మీడియా ముందు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతుంటాయి. కావాలని చేసే వ్యాఖ్యలు కాకపోయినా అవి ఆ వర్గాల మనోభావాలను దెబ్బతీస్తుంటాయి. ఆ తరువాత టంగ్ స్లిప్ అయ్యింది, చింతిస్తున్నాననో, క్షమాపణలు చెప్పడమో చేస్తుంటారు. అదే విధంగా ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన సొంత సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అంబటి చేసిన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గ నేతలను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి. దీంతో కాపు సంఘం నేతలు ఫైర్ అవ్వడంతో అంబటి ఓ మెట్టు దిగారు. తన సామాజిక వర్గీయులకు క్షమాపణ చెబుతూ ట్విట్టర్ వేదికగా అంబటి ఓ వీడియో విడుదల చేశారు. కాపులపై చేసిన తాను చేసిన వ్యాఖ్యల వల్ల తన కులస్తులకు మనస్థాపం కల్గినట్లు తెలుసుకున్నానని అన్నారు. కాపు సోదరులకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.
Read More: ycp government: ఏమిటో ఈ కేంద్రం తీరు..! ఏపికి అనుకూలంగా ఉన్నట్లే ఉంటుంది..! కానీ..?
ఇది ఆయన వీడియో సందేశం..
“అందరికీ నమస్కారం..నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్య కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కులం పట్ల నేను చేసిన వ్యాఖ్యలు నా కలపు సోదరులకు బాదించినట్లుగా అర్థమయ్యింది. ఆ సమయంలో నేను అలా అని ఉండకూడదని తర్వాత నేను పశ్చాత్తాపపడ్డాను, బాధపడిన నా కుల సోదరులందరికీ హృదయపూర్వకంగా, భేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను” అని అంబటి పేర్కొన్నారు.
ఇంతకూ అసలు విషయం ఏమిటంటే..
మంచి వాగ్దాటితో మాట్లాడే అంబటి రాంబాబు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపు సామాజిక వర్గీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాపులు తెలివితక్కువవాళ్లు, ఆవేశపరులు, మాసం ఎక్కువగా తింటారు. మధ్యం బాగా తాగుతారు. ఇవన్నీ మిగతా కమ్యూనిటీల్లో ఉన్నా ..కాపుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమైనా సర్వే చేశారా అన్న ప్రశ్నకూ ‘దీనికి సర్వే అవసరం లేదు. కాపులు తెలివి తక్కువ వాళ్లే” అంటూ అనర్గళంగా మాట్లాడేశారు. అంబటి చేసిన అ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
— Ambati Rambabu (@AmbatiRambabu) June 26, 2021