Ambati Rambabu: వైసీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తిరుపతికి చెందిన ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన దైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ టీవీ చర్చా కార్యాలయంలో ఏపి మంత్రి అంబటి రాంబాబు పాల్గొనగా తిరుపతికి చెందిన నాగేశ్వరరావు నాయుడు అనే వ్యక్తి ఫోన్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు దగ్గర బంధువుగా చెప్పుకున్న నాగేశ్వరరావు నాయుుడు.. వైసీపీలో సోషల్ మీడియాలో పని చేస్తున్న వారి ఇబ్బందులను చెప్పారు. సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ బాగానే ఉన్నా సోషల్ మీడియాలో పని చేస్తున్న వారిని నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియాలో కష్టపడిన వాళ్లను దగ్గరకు తీసుకోవడం లేదు. ఆర్ధికంగా ఆదుకోవడం లేదు. గతంలో తెలుగుదేశం వాళ్లు చేసుకున్నట్లుగా నేడు వైసీపీ వాళ్లు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నాడు నాగేశ్వరరావు నాయుడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా వైసీపీ కార్యకర్తలు లేరు అని చెబుతున్నాడని పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. బలిశారు. నీరు చెట్టులో డబ్బులు పోగేసుకున్నారు లేకపోతే జన్మభూమి కమిటీలో క్యాష్ కొట్టుకున్నారు. ఈ రకంగా వాళ్లు బాగా సంపాదించుకున్నారన్న మంత్రి అంబటి…తెలుగుదేశం అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకో చంద్రబాబుకో, మంత్రులతోనో పరిచయాలు ఉన్న నాయకులు, కార్యకర్తలు అక్రమంగా సంపాదించుకున్నారని అన్నారు. వాళ్లు అలా బాగా సంపాదించుకున్నారు కదా మన వాళ్లు అలా అక్రమంగా సంపాదించుకోవడం లేదన్నది ఆయన భావన అని అన్నారు. ఇది వాస్తవం అన్నారు. వైసీపీలో ఆ పరిస్థితి ఉండదన్నారు.