anandayya: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆనందయ్య మందు హాట్ టాపిక్. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందు ఓ రేంజ్ లో ప్రజల నమ్మకాన్ని చూరగొంది. అయితే, అదే స్థాయిలో వివాదాలు సైతం మూట గట్టుకుంది. ఈ సమయంలో ఆనందయ్య మందు విషయంలో రెండు కీలక అప్ డేట్లు తెరమీదకు వచ్చాయి.
Read More: KCR: కేసీఆర్ , జగన్ … ఏపీ తెలంగాణ ప్రజల బాధలు పట్టించుకోండి!
మందు పంపిణీపై ఆనందయ్య ఏమంటున్నారంటే..
తను తయారు చేసే మందును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. ఔషధం పంపిణీలో పుకార్లు నమ్మవద్దని ఓ వీడియో ద్వారా ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మందు తిరిగి పంపిణీ చేస్తామని పేర్కొన్న ఆనందయ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతానికి ఔషదం తయారికి సంబంధించిన ఎటువంటి ద్రవ్యాలు తన దగ్గర లేవని ఆనందయ్య తెలిపారు.
Read more: YS Jagan: జగన్ చేసిందే… కేసీఆర్ చేయాలంటున్న జనం
పరిశోధనల్లో ఏం తేలిందంటే…
ఆనందయ్య మందు తీసుకున్న వారిలో ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సంయుక్తంగా కమిటీగా ఏర్పాటైంది. ఈ కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించి.. వారిలో 380 మందితో మాట్లాడారు. కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు. కమిటీ విచారణలో దాదాపు అందరూ ఆనందయ్య మందుకు అనుకూలంగానే అభిప్రాయం తెలియజేసినట్లు సమాచారం. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాతే కరోనా సోకలేదని పలువురు తెలిపారు.