Anantapur: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మే రెండో వారంలో మెగా గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఇళ్ల నిర్మాణ అంశంపై జిల్లా కలెక్టర్ .. ఆర్డీఓలు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కారణాల వల్ల గతంలో గృహ ప్రవేశ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. ఈ సారి మాత్రం నిర్ణయించిన సమయానికే కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించి మెగా గృహ ప్రవేశ కార్యక్రమానికి సిద్దం చేసి ఉంచాలని అన్నారు. లక్ష్యాలు చేరుకోని అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ కేశవనాయుడు, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, సీపీఓ ప్రేమ్ చంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
CR Puram (Prakasam): భైరవకోనలో షాపులకు బహిరంగ వేలం పాట