Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి (49) మరణించిన సంగతి తెలిసిందే. పులివెందులకు చెందిన గంగాధర్ రెడ్డి చాలా కాలంగా అనంతపురం జిల్లా యాడకిలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేశారు. తన భర్త మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని అతని భార్య మీడియాకు, పోలీసులకు తెలిపింది. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Viveka Murder Case: గంగాధర్ రెడ్డి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు
అయితే గంగాధర్ రెడ్డి మరణంపై అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. గంగాధర్ రెడ్డి మరణం అనుమానాస్పదమేమీ కాదనీ, అతను అనారోగ్య కారణాలతోనే మరణించాడని వెల్లడించారు. గంగాధర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిపించామనీ, ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని ఎస్పీ పేర్కొన్నారు. వంటిపై ఎలాంటి గాయాలు లేనందున ఆయన మరణం అనారోగ్యం కారణాలతోనే సంభవించి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు ఎస్పీ ఫకీరప్ప.
సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు
వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి అనుచరుడైన గంగాధర్ రెడ్డి గతంలో సీబీఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బెదిరించారనీ, తనకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీంతో పోలీసులు అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పెట్టించి నిఘా ఏర్పాటు చేశారు.
Andhra Pradesh | K Gangadhar Reddy, a witness in the murder case of former state minister YS Vivekananda Reddy died.
Death not suspicious, he died due to ill health. Postmortem done, no external injuries found: Anantapur SP, Fakkeerappa Kaginelli
— ANI (@ANI) June 9, 2022
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews