Tdp : తెలుగు రాజకీయాలలో అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ శ్రేణులు అంటుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే రీతిలో విభజన జరిగిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపి పార్టీ దే పై చేయి. ఎలాంటి ఎన్నికలు వచ్చినా గానీ అనంతపురం జిల్లా వాసులు ఎప్పుడు టీడీపీ కే పట్టం కట్టే వాళ్ళు.
అటువంటిది 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో రెండే రెండు స్థానాలు టీడీపీ గెలవటం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య బాబు, ఉరవకొండ ఎమ్మెల్యే గా పయ్యావుల కేశవ్ టిడిపి తరఫున గెలవడం జరిగింది.
ఇదిలా ఉంటే జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలు రెండే ఉన్నాగాని..తొలి విడత పంచాయతీ ఎన్నికల సమయంలో …ఏకగ్రీవాలు అధికార పార్టీకి ఎక్కువ అవకుండా ఎక్కడికక్కడ జిల్లా టిడిపి క్యాడర్ అడ్డుకోవడం జరిగింది. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనంతపురం వాసులు వైసీపీ కే పట్టం కట్టినట్లు తాజా ఫలితాలు వెల్లడించాయి. దీంతో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో.. ప్రజా క్షేత్రంలో కూడా రాణించే దిశగా టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. తొలి విడత అనంతపురం జిల్లా పంచాయతీ ఎన్నికల పరిస్థితి చూస్తే ఓట్ల రూపంలో.. ఎన్నికలు జరిగిన 163 గ్రామాలలో137 చోట్ల వైసిపి విజయం సాధించగా టిడిపి కేవలం 26 స్థానాలకే పరిమితం కావడం జరిగింది.
అంతే కాకుండా కొన్ని మండలాల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థులు అడ్రస్ కూడా గల్లంతైన పరిస్థితి అనంతపురంలో నెలకొంది. నామినేషన్ వేస్తున్న సమయంలో ఉత్సాహంగా ఉన్న టిడిపి కార్యకర్తలు.. ఎన్నికల నాటికి చతికిల పడ్డారు అని భావిస్తున్నారు. దీంతో ఈసారి ప్రజా ఎన్నికల ఓట్ల సమయంలో రెండో విడతలో టిడిపికి పడేలా జిల్లా క్యాడర్ మొత్తం రెడీ అవుతుంది.