ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైెఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డులను ప్రధానం చేశారు. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ఠ అతిధిగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆత్మీయ అతిధిగా వైఎస్ విజయమ్మలు హజరై ఆవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ .. వైఎస్ఆర్ తన దైన మార్క్ పాలనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని కీర్తించారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అవి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. వైఎస్ఆర్ పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య – 2022 పురస్కారాలను అందజేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ .. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వందనాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్న వారికి అవార్డులు అందజేస్తున్నామన్నారు. అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. వ్యవసాయం, కళలు -సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు, 30 అవార్డులను అందజేశారు. ఇందులో 20 వైఎస్ఆర్ జీవిత సాఫల్య, పది వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10లక్షల నగదుతో పాటు వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్ఆర్ సాఫల్య అవార్డుకు రూ.5లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?