Andhra Pradesh : ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ స్థానిక సంస్థల ఎన్నికలు . ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో… వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు వేడెక్కుతోంది.
ముఖ్యంగా వైసీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేస్తున్నారు. అయితే , ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలింపులో మరో ముందడుగు వేసింది.
Andhra Pradesh : జగన్ సర్కారు కీలక నిర్ణయం
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం పొందిన రెండు కీలక బిల్లులకు హైకోర్టులో బ్రేక్ పడిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి నెలకొంది. అయితే , ప్రస్తుత తరుణంలో ఓ వైపు ఎన్నికల హీట్ కొనసాగుతుంటే మరోవైపు అధికార పార్టీ కీలక ముందడుగు వేసింది. విశాఖలో సీఎ క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ముమ్మర కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లు సిద్దం అయ్యాయని తెలుస్తోంది. లే ఔట్ ప్లానుకు ఉడా ఆమోదం తెలిపిందని అంటున్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయం….
విశాఖలో రూ. 113 కోట్లతో సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణానికి ఉడా ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి వెంటనే రూ. 16 కోట్లు అడిగినట్టు సమాచారం. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుంటే నిధుల విడుదల చేసి వెంటనే, పనుల ప్రారంభానికి ప్రభుత్వం సిద్దమవుతోన్నట్టు తెలుస్తోంది.