Andhra Pradhesh: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏపీలో సైతం పలు నిబంధనలతో కర్ఫ్యూ విధించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు కర్ఫ్యూ ఎలా పాటిస్తున్నారో పరిశీలించామని పేర్కొన్న ఏపీ డీజీపీ ప్రజలలో సెల్ఫ్ డిసిప్లీన్ ఉంది అని అన్నారు. ప్రజలంతా అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఏపీ డీజిపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు.
కీలక ఆదేశాలు
అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ డీజిపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు.కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అత్యవసర ప్రయాణికుల కోసం నేటి నుంచి ఇ-పాస్ విధానం అమలు చేస్తామని, దీని కోసం పోలిస్ సేవ యాప్ వినియోగించుకోవాలని సూచించారు. శుభకార్యాలకు అనుమతి తప్పనిసరన్న డీజీపీ.. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు.
అందరూ కుటుంబం…
కొద్దిరోజుల్లో మనం ఈ కోవిడ్ నుంచీ బయటపడుతాం అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. రాజకీయ పరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దని కోరారు. ఇప్పుడు కోవిడ్ నుంచీ బయటపడాల్సిన సమయం అని చెప్పిన ఆయన అందరూ బాధ్యతగా కోవిడ్ నుంచి బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలి అని పేర్కొన్నారు. ప్రజలందరూ డబుల్ మాస్కు ధరించాలన్నారు.