KCR తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు ఇదో ఉదాహరణ. ఆయన పొలిటికల్ ప్లాన్ వ్యూహకర్తలకు అందని విధంగా ఉంటాయని మరోమారు రుజువు అయింది.
తెలంగాణ ఉద్యోగుల్లో పీఆర్సీ నివేదిక అలజడి రేపింది. నివేదిక సిఫారసుల్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కాయి. అన్యాయమైన సిఫారసుల్ని ప్రభుత్వం పట్టించుకోవద్దని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ మరో అస్త్రం వదిలారు.
KCR భగ్గుమన్న ఉద్యోగులు…
పీఆర్సీ సిఫార్సులకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ వద్ద ఐక్యవేదిక ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పీఆర్సీ నివేదిక ప్రతుల్ని ఉద్యోగులు చింపివేశారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పీఆర్సీపై నియమించిన త్రిసభ్య కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు. నివేదికపై అభ్యంతరాలను కమిటీకి వివరించారు. వేతనాలు సవరించాల్సిన కమిటీ నివేదిక వేతనాలను తగ్గించడానికే సమర్పించినట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచించి మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఏ తగ్గించాలని పీఆర్సీ నివేదిక సిఫారసు చేయడాన్ని ఉద్యోగుల నేతలు ఖండించారు. పీఆర్సీ సిఫారసుల్ని ప్రభుత్వం పట్టించుకోవద్దన్నారు. ఉద్యోగులు నిరాశకు గురికావొద్దని.. త్వరలోనే ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నిరుద్యోగుల ఆగ్రహం
మరోవైపు ఉద్యోగుల తమ ఆకాంక్ష మేరకు పీఆర్సీ దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే నిరుద్యోగులు మాత్రం ఇకో రకంగా ఫైరయ్యారు. పీఆర్సీలో పదవీ విరమణ వయసు పెంచారని పేర్కొంటూ ఈ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కవని వాపోయారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగులకి మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగులకి రుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్నీ త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చామని మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మొత్తంగా ఉద్యోగుల ఆందోళనలు చేస్తుంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడం ద్వారా ఆగ్రహ జ్వాలలను తగ్గించారని పలువురు అంటున్నారు. అదే సమయంలో రిటైర్మెంట్ వయసు పెంచడంతో ఆగ్రహంలో ఉన్న యువతకు సైతం నిరుద్యోగ భృతి ద్వారా శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?