ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ సక్రమంగా లేదని సరి చేసి దాఖలు చేయాలని రిజిస్ట్రీ సూచించింది. పిటిషన్ ను వెనక్కు ఇచ్చింది. దీంతో సుప్రీం కోర్టులో నేడు పిటిషన్ విచారణకు వచ్చే పరిస్థితి లేదు. పిటిషన్ను సరిచేసి ఈరోజు దాఖలు చేయలేకపోవచ్చు అని తెలుస్తోంది.
దీనివల్ల సోమవారం వరకు స్టేషన్ దాఖలు చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎస్ ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం శనివారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. పంచాయతీ నోటిఫికేషన్ విడుదల తర్వాత పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చు అంటూ నిన్ననే ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించలేదని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ వాదన. అయితే నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.