AP Assembly Budget Session: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తొలి సారిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇంతకు ముందు కరోనా నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ఆయన వర్చువల్ పద్ధతిలో రాజ్ భవన్ నుండే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకూ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో షెడ్యుల్ ఖరారు చేయనున్నారు.
AP Assembly Budget Session: ధర్మాన ప్రసాదరావు లేఖపై
ఈ సమావేశాల్లో మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సీనియర్ వైసీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు చట్ట సభల అధికారాలపై చర్చ జరగాాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారామ్, సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాయడంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. దాదాపు 30 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ సమాయత్తం అయ్యింది. గత సమావేశంలో శపథం చేసి బయటకు వెళ్లినందున చంద్రబాబు మినహా ఇతర సభ్యులు సమావేశానికి హజరు అవుతున్నారు.