AP Assembly Budget Session: 12వ రోజు ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రభుత్వం పలు బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనుంది. పలు శాఖల బడ్జెట్ డిమాండ్ గ్రాంట్లను కూడా ప్రభుత్వం సభలో ఆమోదానికి ఉంచనుంది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశంపై కీలక చర్చ జరగనుంది. శాసన – న్యాయ అధికారాల పరిధిపై చర్చించే అవకాశం ఉంది.
సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేవనెత్తిన అంశంపై సభలో చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపై ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత మంత్రి ధర్మాన ప్రసాదరావు దీనిపై కామెంట్స్ చేశారు. శాసన – న్యాయ అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు. దీనిపై నేటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?