AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి హాట్ హాట్ గా మొదలు కానున్నాయి. అమరావతి అసెంబ్లీ హాలులో ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు, పాల్గొననున్నారు., ఈ సమావేశంలో అసెంబ్లీ షెడ్యుల్ ఖరారు చేయనున్నారు.
Read more :CM YS Jagan: వరస తలనొప్పుల్లో ఉన్న జగన్ కి బ్రహ్మాండమైన న్యూస్ చెప్పిన కేంద్రం !
AP Assembly Budget Session: బీఏసీ ముగిసిన వెంటనే కేబినెట్ భేటీ
బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంది. అసెంబ్లీ సమావేశాలను బముగిసిన వెంటనే హిష్కరించాలని తొలుత టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించడంతో అసెంబ్లీ సమావేశాలు చప్పచప్పగా సాగుతాయని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీఎల్పీ సమావేశంలో సమావేశాలకు హజరు కావాలని నిర్ణయం తీసుకోవడంతో సమావేశాలు వేడివేడిగా జరిగే అవకాశం ఉంది. రేపు ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. అనంతరం ప్రభుత్వ విధానాలను నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు.
అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారం, సీఆర్డీఏ చట్టం రద్దు పై ఇటీవల హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తరువాత ఈ సమావేశాలు జరుగుతుండటంతో ఈ అంశంపై చర్చిస్తామని మంత్రులు పేర్కొంటున్నారు. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పులో పేర్కొన్న నేపథ్యంలో దానిపై చర్చకు అధికార పార్టీ సిద్ధం అవుతోంది. ఈ సమావేశాల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు, రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్టు తదితర కీలక అంశాలపై ప్రభుత్వంపై నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధం అవుతోంది. సమావేశాల్లో తొలుత ఇటీవల మృతి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీ నివాళులర్పించనుంది.