కోర్టు దిక్కరణ కేసులో ఏపి అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు హైకోర్టు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి కోర్టు దిక్కరణకు పాల్పడినట్లు గత వారం హైకోర్టు వెల్లడించింది. ఈ రోజు తీర్పు వెల్లడించింది.
ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు హజరుకాాగా ఉదయం నుండి సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకూ కోర్టులోనే కూర్చోవాలని శిక్ష విధించడంతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజులు సాధారణ జైలు శిక్ష విధించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?