AP Assembly: అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు తరచు ఆందోళన చేస్తూ సభా వ్యవహారాలకు ఆటంకం కల్గిస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఎమ్మెల్యేల ప్రవర్తన పై కొత్త రూలింగ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న, ఈ రోజు టీడీపీ సభ్యులు సభలో ఆందోళన నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై చర్చ చేపట్టాలంటూ నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ సభ్యుల ఆందోళన నిర్వహిస్తూ స్పీకర్ పోడియంలోకి వెళ్లి కాగితాలు చించి స్పీకర్ పై విసిరివేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read More: AP Assembly: ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు ఒక రోజు సస్పెన్షన్
AP Assembly: సభాకార్యక్రమాలకు ఆటంకం సృష్టించిన టీడీపీ
టీడీపీ సభ్యుల తీరును సీఎం వైఎస్ జగన్, అధికార పక్షం తప్పుబట్టింది. అధికార పక్షం, స్పీకర్ వారించినా ఆందోళన కొనసాగించడంతో నిన్న స్పీకర్ తమ్మినేని సీతారామ్..అచ్చెన్నాయుడుతో సహా అయదుగురు టీడీపీ సభ్యులను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ తమ్మినేని వారిని ఈ రోజు సెషన్ నుండి సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కొత్త రూలింగ్ ప్రతిపాదన
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. వైట్, గ్రీన్. రెడ్ లైన్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఆ లైన్ లు దాటితే ఆటోమెటిక్ గా సభ్యుల సస్పెన్షన్ అయ్యేలా కొత్త రూలింగ్ ను ప్రతిపాదించారు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదనకు సభ ఆమోదం తెలిపింది. శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదన రూలింగ్ ను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూల్ కమిటీకి సిఫార్సు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్రతిపాదనను అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు తెరపైకి తెచ్చారనీ, సభను హుందాగా నడిపించేందుకు ఈ