ఏపి అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైయ్యాయి. సభ మొదలైన వెంటనే ప్రతిపక్ష టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. జాబ్ కాలెండర్ అని ప్రకటించిన ఏపి ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిందంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని .. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని పేర్కొన్నారు.
టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. మరో పక్క టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీపీ సభ్యులు సభకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదనీ, ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుపడుతోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు (టీడీపీ) వచ్చినట్లు ఉందని బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరు పట్ల అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.