AP Assembly: పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ సందర్భంలో పెగాసస్ పై విచారణకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు కావడంతో స్పీకర్ తమ్మినేని .. హౌస్ కమిటీని ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా హౌస్ కమిటీని నియమించారు.
AP Assembly: భూమన చైర్మన్ గా హౌస్ కమిటీ
హౌస్ కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్ధసారధి, అమరనాథ్, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిథర్ ని నియమిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెగాసిసె ను గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిందని దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీ చంద్రబాబు హయాంలో ఏపి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని సంచన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది.
దీనిపై ఏపిలో అసెంబ్లీలో అధికార పక్షం చర్చ చేపట్టింది. విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. దీంతో స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేడు కమిటీని ప్రకటించారు. మరో పక్క వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఖండిస్తొంది. చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ డీజీగా పని చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని తెలిపారు. అయితే ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ స్పందించలేదు.