AP assembly: ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొత్త రూల్ ప్రవేశపెట్టారు. సభలోకి సభ్యులు సెల్ ఫోన్ లతో రాకూడదని స్పీకర్ సీతారామ్ రూలింగ్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారనే సమాచారం ఉందని స్పీకర్ అన్నారు. వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఇకపై సెల్ ఫోన్ లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని అదేశాసిస్తూ, ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలన్నారు.
AP assembly: సభలోకి సభ్యులు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావద్దు
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్ లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానమని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. సభ్యులు స్వచ్చందంగా సెల్ ఫోన్లు సెరండర్ చేయాలన్నారు. గురువారం కూడా సభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేసిన నేపథ్యంలో వారిని సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించడంతో ఒక రజు పాటు 11 మందిని టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిమ్మకాయల చిన రాజప్ప, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, బి అశోక్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. అనంతరం సభా కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.