AP Assembly: ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు ఒక రోజు సస్పెన్షన్ కు గురైయ్యారు. ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 9వ రోజు సోమవారం కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ నిరసన చేపట్టారు. టీడీపీ సభ్యుల తీరు పట్ల అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
AP Assembly: టీడీపీ సభ్యులు ఒక రోజు సస్పెన్షన్
తొలుత టీ డీ పీ సభ్యుల నిరసన మధ్యనే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. మంత్రులు సమాధానం చెబుతున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు సభలో బల్లలపై చేతులతో కొడుతూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులపై పలు మార్లు స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసినా వారు ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో టీడీపీి సభ్యులను ఒక రోజు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు.