AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం నలుగురు సభ్యులను ఈ నెల 25వ తేదీ వరకూ సస్పెండ్ చేయగా తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఈ నెల 25వ తేదీ వరకూ మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేశారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలు నిర్వహించిన అనంతరం పోలవరంపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. సభలో టీడీపీ సభ్యులు విజిల్ వేయడంతో స్పీకర్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభామర్యాదను కాపాడాలంటూ హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్ లను ఈ నెల 25వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని.. విజిల్ వేసిన మిగతా సభ్యులను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేశారు.
Read More: AP Politics: ఫుల్ ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ..! బీజేపీ – టీడీపీ మధ్యలో..కానీ..!?
AP Assembly: బుద్దీ, జ్ఞానం లేని వాళ్లు చాలా మంది ఉన్నారు
సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై మండిపడ్డారు. అసెంబ్లీలో బుద్దీ, జ్ఞానం లేని వాళ్లు చాలా మంది ఉన్నారంటూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘాటుగా విమర్శించారు తాము స్పీకర్ క దాదాపు అయిదు మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నామనీ, అయినా తమను అకారణంగా సస్పెండ్ చేశారని అన్నారు. జగన్ సర్కార్ మద్యంపై వచ్చే అదాయం మీదే దృష్టి పెట్టిందని రామ్మోహన్ ఆరోపించారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన బాగోలేదని అన్నారు. సభలో కల్తీసారా కు సంబంధించి ఆధారాలను టీడీపీ బయటపెడుతుంటే సీఎం జగన్ ముఖం చాటేశారని విమర్శించారు.
‘అసెంబ్లీలో సీఎం భజన’
మార్షల్స్ సాయంతో సభను నడిపిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శించారు. తమలో ఎంత మందిని సస్పెండ్ చేసినా చివరి సభ్యుడు ఉన్నంత వరకూ కల్తీ సారా పై పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. వైసీపీ సభ్యులు సభలో సీఎం భజన చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. మర్షల్స్ సాయంతో సభ నిర్వహించడం చూస్తుంటే తమకు సిగ్గేస్తుందన్నారు. కల్తీ సారాపై ఆధారాలను తాము బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారని విమర్శించారు.