ఏపి అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ రోజు (సోమవారం) అసెంబ్లీలో ప్రశ్నాత్తరాల అనంతరం కీలక అంశాలపై స్పల్పకాలిక చర్చ జరగనుంది. పారిశ్రామిక ప్రగతి, ఆర్ధికాభివృద్ధి,పై చర్చ సాగనుంది. అంతే కాకుండా విద్య ,వైద్యం, నాడు – నేడు పై సల్ప కాలిక చర్చ తో పాటు సభలో నేడు ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటి స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
తొలుత అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండ్లపై నిరసన వ్యక్తం చేస్తూ బయలుదేరగా, పోలీసులు అడ్డుకుని ఎడ్ల బండ్లను స్టేషన్ కు తరలించారు. ఎడ్లను స్టేషన్ తరలించడం ఏమిటని నారా లోకేష్ పోలీసులతో వాదనకు దిగారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ నుండి ఎడ్ల బండ్లను టీడీపీ నేతలు రోడ్డుపై తీసుకువచ్చారు. ఎడ్లకు బదులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాడి తగిలించుకుని బండిని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు.