Somu Veerraju: ఏపి బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రజాగ్రహ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఈ సభ నిర్వహణపై మంత్రులు పేర్ని నాని, బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తదితరులు విమర్శలు గుప్పించారు. ఆ నేతల విమర్శలపై బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. తమ్ముడు పేర్ని నానికి వినమ్రంగా చెప్పున్నా..మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి, మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అలాగే మంత్రి కొడాలి నాని చేతికి తాళ్లు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అంటూ సెటైర్ వేశారు. మా పార్టీ ఎవరో ఎంపీకీ లీజుకు ఇచ్చామని మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వారికి మీరు ఏమి లీజులు ఇచ్చారో చెప్పమంటావా, మీ లీజుల గురించి మేము మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయి. మా పార్టీ కార్యాలయాల అద్దెలపై మాట్లాడుతున్నారు. మీ అద్దెలు ఎవరు కడుతున్నారో అందరికీ తెలుసు, బద్వేల్, తిరుపతి ఎన్నికలపై చర్చద్దాం దమ్ముంటే రండి సోము వీర్రాజు సవాల్ విసిరారు. అంత భయం లేకపోతే బద్వేల్ లో ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచారని ప్రశ్నించారు.
Somu Veerraju: తమ్మినేని.. ఆ ప్రాజెక్టులపై పోరాటం చేయండి
తమ్మినేని సీతారాం స్పీకర్ అన్న విషయాన్ని మరిచి మాట్లాడుతున్నారన్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ పై పోరాటం మాని ఆయన జిల్లాలోని తోటపల్లి, వంశధార ప్రాజెక్టులపై పోరాటం చేయాలని సోము వీర్రాజు సూచించారు. మంత్రి బొత్సా సత్యనారాయణకు బీజేపీ చరిత్ర గురించి ఏమి తెలుసునని అన్నారు. రాజకీయ ఉనికి కోసం పార్టీలు మారే వారు అందరూ బీజేపీ గురించి మాట్లాడేవారే అంటూ సోము విమర్శించారు. పదవులు అవసరం లేదనుకున్న వారు వచ్చి బీజేపీలో చేరవచ్చంటూ బొత్సాను సోము వీర్రాజు ఆహ్వానించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలు తినే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించరా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదలు తినే తిండికన్నా వినోదమే ముఖ్యమైన అంశమా అని ప్రశ్నించారు. బీజేపీ పొత్తుతో 2014లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని పయ్యావుల కేశవ్ మర్చిపోయారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ పోరాటం
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇకపై బీజేపీ దూకుడుగా వెళుతుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో మద్యంపై చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు సమర్ధించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది రాష్ట్రంలోని ఆడపడుచుల కోసమేనన్నారు. ప్రభుత్వం రూ.250లకు మందు అమ్మి పేదవాడి రక్తం తాగుతోందని మండిపడ్డారు. పేదల బలహీనతను వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మందు రేట్లు తగ్గిస్తా అన్నది.. వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమేనని సోము వీర్రాజు అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?