AP BJP Protests: రాష్ట్రంలో ఇంతకు ముందు హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ బీజేపీ ఆంధోళనలు నిర్వహించింది. ఆ తరువాత బలవంతపు మార్పిడులు జరుగుతున్నాయంటూ ఆందోళన చేశారు. ఆ తదుపరి బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండగా కడప జిల్లా పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి భూమిపూజ నిర్వహించడంతో పాటు టిప్పును ఏకంగా దేశభక్తుడు అంటూ కీర్తించారు. దీనిపై బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలోనే పెద్ద ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే శివప్రసాద్ చర్యలను బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు.
Read More: Karnataka CM: కులం, మతం, మఠం – యడ్యూరప్ప మార్పునకు ముందు ఎన్నో ట్విస్టులు..!!
ఇది చాలదు అన్నట్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్య ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరో వివాదాన్ని రాజేశారు. బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకేంచే గోవధపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడో తీసుకువచ్చిన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మరల బీజేపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. అసలే హిందూత్వ ఎజెండాతో రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి వైసీపీ ఎమ్మెల్యేల వివాదాస్పద చర్యలు వారు ఆందోళనలు చేయడానికి అస్త్రాలను ఇస్తున్నట్లు ఉంది. గోవధ నిషేద చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పేవరకూ బయట తిరగనివ్వమంటూ హెచ్చరించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని అరెస్ట చేసి ప్రాసిక్యూట్ చేయాలంటూ హిందూపురంలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం అంశానికి తోడు గోవధ నిషేద చట్టం రద్దు పై బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఈ వివాదాలు సద్దుమణగడానికి సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.