AP BJP: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సోము వీర్రాజు నెల్లూరు పర్యటనలో ఉన్న సమయంలో పలువురు సీనియర్ నేతలు విజయవాడలోని ఓ హోటల్ లో భేటీ అవ్వడం ఆ పార్టీలో కలకలాన్ని రేపుతోంది. సోముకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంగా భావిస్తున్నారు. సోము వీర్రాజు నాయకత్వాన్ని కొందరు నేతలు చాలా కాలం నుండి విభేదిస్తున్న సంగతి తెలిసిందే. సోము వ్యవహారాల శైలిపై గతంలో పలు మార్లు ఆ పార్టీ నేతలు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేయడం, ఆ నేపథ్యంలో సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా పలువురు సీనియర్ నేతలతో కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతోంది. నూతన అధ్యక్షుడి ఎంపిక జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న తరణంలో విజయవాడలోని ఓ హోటల్ లో నేతల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ కు ఆత్మీయ సమావేశం పేరుతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలీప్, పాతూరి నాగభూషణం, రమేష్ నాయుడు, ఎస్ కె బాజీ, శ్రీనివాసరాజు. మాజీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సోము వీర్రాజు పేరు ప్రస్తావించకుండా నేతలు ఈ సమావేశంలో మాట్లాడటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయానికి తన వంతు కృషి చేసిన సత్యకుమార్ ను ఏపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు కోరడంతో పాటు ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. కాగా ఈ సమావేశంపై సోము వీర్రాజు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?