AP Cabinet: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా అయిదు షిషింగ్ హార్బర్ల డీపిఆర్ లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు తొమ్మిది గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదించింది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా జైన్ కార్పోరేషన్, సిక్కు కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP Cabinet: అయిదు ప్రాంతాల్లో సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్స్
రాష్ట్రంలో అయిదు ప్రదేశాలలో సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్స్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధి, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు, జయలక్ష్మి నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ శారదాపీఠానికి కొత్తవలస లో 15 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల 17వ తేదీ నుండి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.