ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
- వైఎస్ఆర్ చేయూత పై స్టేటస్ నివేదికను కేబినెట్ ఆమోదం
- గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- ఉద్యోగుల పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లకు ఆమోదం
- రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
- గ్రీన్ ఎనర్జీ లో రూ.81వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టు ఆమోదం
- భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం, ఒక్కో ఆదాలత్ కు పది పోస్టులకు మంత్రిమండలి ఆమోదం
- కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపు ర్యాటీఫైకి కేబినెట్ ఆమోదం
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు ఆమోదం
- ఏపి సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు కేబినెట్ అమోదం
- పాఠశాలల్లో 8 తరగతి విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీకి మంత్రిమండలి ఆమోదం
- నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం
- కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి ఆమోదం
- ప్రతి మండలంలో రెండు పీహెచ్ సీలకు కేబినెట్ ఆమోదం
- 45 నుండి 60 ఏళ్ల లోపు మహిళలకు ఆర్ధిక సాయం కోసం పథకం
- జల్ జీవన్ మిషన్ అమలుకు రుణం తీసుకునేందుకు ఆమోదం
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ర్యాటిఫికేషన్ కు నిర్ణయం
- వర్శిటీ అధ్యాపకుల కోసం నెట్ పాస్ నిబంధనకు ఆమోదం
- పాడేరు గిరిజన వర్శిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది భర్తీకి నిర్ణయం
- మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనానికి ఆమోదం
- సీఆర్డీఏ అభివృద్ధికి రూ.1600 కోట్ల రుణానికి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం
- సీఆర్డీఏ చట్టంలోని ఓ క్లాజ్ లో మార్పు చేస్తూ ఆమోదం
- ఎన్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
- అదనంగా 20 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టాలని నిర్ణయం
- తిరుపతి పేరూరులో నోవాటెల్ హోటల్ నిర్మాణానికి భూమి మంజూరు
- ఒబెరాయ్ గ్రూపునకు 30 -32 ఎకరాలు మంజూరు