Vijayawada, AP: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ (AP Cabinet Meet) జరగనుంది. మంత్రివర్గ పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాత మంత్రులతో పాటు కొత్త మంత్రులు పాల్గొననున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించనుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రధానంగా ప్రస్తుత వేసవిలో ఎదుర్కొంటున్న విద్యుత్ కోతల నివారణ చర్యలు, రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, పోలవరం ప్రాజెక్టు తదితర కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.అదే విధంగా పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు సంక్షేమ పథకాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు తమ తమ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునే పనిలో ఉన్నారు. కాగా కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖలు సిద్ధం చేయాలని సీఎంఓ నుండి సర్క్యులర్ జారీ అయ్యింది.