AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 10.15 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం శాసనమండలిలో బడ్జెట్ ను మంత్రి సిదిరి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు. రూ.2.30 లక్షల కోట్ల నుండి రూ.2.40 కోట్ల వరకూ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. బడ్జెట్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా వ్యవసాయం, విద్య, వైద్యానికి అధిక కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాన రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు పేర్కొన్న బుగ్గన..ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్న పథకాలకు నిధులు కేటాయించామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా బడ్జెట్ రూపొందించామని బుగ్గన పేర్కొన్నారు. తొలుత సచివాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?