NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల 13న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ..?

ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో భేటీ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిదవ తేదీలోగా ఆయా శాఖలకు చెందిన అంశాలపై ప్రతపాదనలు పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని శాఖలను ఆదేశించింది. కాగా ఈ కేబినెట్ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చించనున్నది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

AP CM YS jagan

ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం, ముందస్తు ఎన్నికలు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గం ఈ అంశాలపై చర్చించనున్నదని తెలుస్తొంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికే పలువురు మంత్రులు, రాష్ట్ర పెద్దలు పలు సందర్బాల్లో ప్రకటించి ఉన్నారు. దానికి తోడు రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన ఎస్ఎల్పీ విచారణ సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా పలు అంశాలపై స్టే ఇవ్వడంతో, శీతాకాల సమావేశాల్లోనే మెరుగైన రీతిలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజధాని అంశం రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం అంటూ ఏపి హైకోర్టుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఉండటం, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తొంది.

AP Cabinet Meet file Photo

రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్దేశించలేవని, అలాంటి ఆదేశాలు జారీ చేయడానికి కోర్టులు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావని కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో గతంలో ఉపసంహరించుకున్న వికేంద్రీకరణ బిల్లు స్థానంలో మెరుగైన బిల్లు ను తీసుకువచ్చేదానిపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు తదితర కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు సంక్షేమ పథకాలపై కేబినెట్ చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, తాము ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే ఉన్నామంటూ మంత్రి సిదిరి అప్పలరాజు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలకు సూచనగానే తెలుస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. వైసీపీతో సహా ప్రధాన రాజకీయ పక్షాలు జనాల్లో తిరుగుతున్నాయి. అందుకే షెడ్యుల్ ప్రకారం ఎన్నికల జరిగే వరకూ ఆగడమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడమా అనే దానిపైనా జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో చర్చిస్తారని అనుకుంటున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?