ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఇవేళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎన్ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపనుంది. కడప సున్నపురాళ్లపల్లెలో జేఏన్ డబ్ల్యు స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు నిన్న ఎస్ఐపీబీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపనుంది.
అదే విధంగా అసెంబ్లీ సీతాకాల సమావేశాల గురించి కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా వివిధ శాఖల నుండి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. పరిపాలనా వికేంద్రీకరణ, పోలవరం ప్రాజెక్టు తదితర కీలక అంశాలపై చర్చించనుంది. త్వరలో విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని మంత్రులు పదేపదే చెబుతున్న నేపథ్యంలో సీతాకాల సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.