AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ రోజు ఉదయం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. కేబినెట్ లో ఇంతకు ముందు మాదిరిగానే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు.
AP Cabinet: మంత్రులు – శాఖలు
- ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
- సీదిరి అప్పలరాజు – పశు సంవర్థన, మత్స్యశాఖ
- బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
- రాజన్న దొర – గిరిజన సంక్షేమ శాఖ
- గుడివాడ అమరనాథ్ – పరిశ్రమల శాఖ
- బూడి ముత్యాల నాయుడు – పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి
- దాడిశెట్టి రాజా – రోడ్లు భవనాల శాఖ
- పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమచార పౌరసంబంధాల శాఖ
- తానేటి వనిత – హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ
- కారుమూరి వెంకట నాగేశ్వరరావు – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
- కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ
- జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
- మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
- విడతల రజిని – వైద్య ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
- అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
- ఆదిమూలపు సురేష్ – మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి
- కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం – సహకార, మార్కెటింగ్ శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖ
- ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
- కే నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ
- అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమ శాఖ
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్ధిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
- గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
- ఉషాశ్రీ చరణ్ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ