NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: విద్యాశాఖలోనూ కన్ఫ్యూజన్.. ఏపికి రాజధాని పేరు లేకుండానే భారతదేశ పటం..

AP Capital: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖను పరిపాలనా రాజధాని, అమరావతిని శానస రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పిస్తూ చట్టం చేసినా అది కోర్టు వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోవడం, ఆ పరిణామాల క్రమంలో ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డిఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకుంది. అయితే త్వరలో మెరుగైన బిల్లు తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మంత్రుల నుండి కూడా స్పష్టమైన సూచనలు లేకపోవడంతో ఉన్నతాధికారులు ఏమి చెప్పేలని పరిస్థితుల్లో ఉన్నారు.

 

AP Capital disappear on india map
AP Capital disappear on india map

 

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండగానే భారతదేశ పటం

దీంతో రాష్ట్ విద్యాపరిశోధన, శిక్షణ మండలి 2020 – 21కి ముద్రించిన నాల్గవ తరగతి పాఠ్య పుస్తకంలో రాష్ట్రానికి రాజధాని లేకుండగానే భారతదేశ పటాన్ని ముద్రించారు. భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాజధాని పేరు ఇవ్వలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి వదిలివేశారు. దీనిపై ఉపాధ్యాయుల నుండి నిరసన వ్యక్తం అవుతోంది. భారతదేశం పటం చూపిస్తూ విద్యార్ధులకు రాష్ట్రాలు, రాజధానుల పేర్లు చెప్పే క్రమంలో రాష్ట్ర రాజధాని ఏమని చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్ధుల్లో గందగోళం సృష్టించడం తగదు

దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. పాఠ్యపుస్తకంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఇవ్వకపోవడం దుర్మార్ఘమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని పరీక్షల్లో ప్రశ్నగా వస్తే విద్యార్ధులు ఏం జవాబు రాయాలని ప్రశ్నించారు రామకృష్ణ., కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు. రాజధాని అంశంపై విద్యార్ధుల్లో గందగోళం సృష్టించడం తగదని అన్నారు. దేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపిని చేసిన ఏకైన ప్రభుత్వం జగన్ సర్కారేనని రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రాజధాని ప్రాంత భూములను తాకట్టు పెట్టడంలో ఉన్న శ్రద్ద, విద్యార్ధుల పాఠ్యాపుస్తకాాల్లో ముద్రించడంలో లేదెందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆంకాంక్షలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదని రామకృష్ణ అన్నారు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ అమరావతినే ఏపి రాజధానిగా స్పష్టమైన ప్రకటన చేసి ఆమోయమానికి తెర దించాలని కోరారు రామకృష్ణ.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?