రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కుంభకోణంలో అయిదుగురిని ఏపి సీఐడీ అరెస్టు చేసింది. కొల్లి శివరామ్, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దోరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతి పరిధిలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణ నేపథ్యంలో 169.27 ఎకరాలకు సంబంధించిన కొనుగోళ్ల కేసులో పై అయిదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ, బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లుగా అభియోగాలు ఉన్నాయి.
అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, రాయపూడి, తుళ్లూరు. ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నెంబర్ లలోని సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి తన బంధువులు, పరిచయస్తుల పేరుతో కొనుగోలు చేశారని గతంలో వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి సీఐడీ దర్యాప్తులో రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ ఖాతా ద్వారా చెల్లింపులు జరిపి వ్యవహారాలు నడిపినట్లుగా తెలింది. ఈ కేసులో ఇతర నిందితులు వారి తరపు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?