AP CID Case: స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజుల క్రితం లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో లక్ష్మీనారాయణ ఏ 2 గా ఉన్నారు. లక్ష్మీనారాయణ నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో 13వ తేదీ ఏపీ సీఐడీ ఎదుట హజరుకావాలంటూ నోటీసులు అందజేశారు. అయితే లక్ష్మీనారాయణ ఆ రోజు నుండి నేటి వరకూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే లక్ష్మీనారాయణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారించింది. సుమారు అరగంట పాటు విచారించిన హైకోర్టు 15 రోజుల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ ముగ్గురుని అరెస్టు చేసింది.
కాగా హైదరాబాద్ లోని లక్ష్మీనారాయణ నివాసంలో శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ లో గతంలో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ తేల్చింది. ఈ నిధులను ఏడు షెల్ కంపెనీలకు తరలించినట్లు పేర్కొంటున్నారు. అప్పట్లో లక్ష్మీనారాయణ స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు హయాంలో ఆయన వద్ద లక్ష్మీనారాయణ ఓఎస్డీ గా పని చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?