టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, ఐటీడీపీ నిర్వహకుడు చింతకాయల విజయ్ కి ఏపి సీఐడీ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేయడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు అనకాపల్లి జిల్లా నర్సీపర్నం వెళ్లారు.
సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు .. చింతకాయల విజయ్ ఇంటికి వెళ్లారు. సీఐడీ అధికారులు వెళ్లిన సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. చింతకాయల విజయ్ ఈ నెల 27వ తేదీ సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరిట పోస్టులు పెట్టినట్లు చింతకాయల విజయ్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మరో సారి చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నోటీసులపై విజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?