AP CID : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మరి కొందరు మంత్రులపై ఫిర్యాదు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి సీఐడీ నోటీసు జారీ చేసింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఐడీకి ఆర్కే ఫిర్యాదు చేసిన సంగతి సంగతి. ఈ ఫిర్యాదుపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు వారిని విచారణకు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఫిర్యాదిదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హజరై ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సమర్పించాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.