NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మార్గదర్శి కేసులో దూకుడు పెంచిన ఏపీసీఐడీ .. రామోజీ కుమార్తె శైలజకు నోటీసులు జారీ

Share

మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసు దర్యాప్తలో ఏపి సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో రామోజీరావు కుమార్తె, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజాకిరణ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏ 1 గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా మార్గదర్శి ఎండీ  శైలజా కిరణ్, ఏ 3 కి సిబ్బందిని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు అందుబాటులో ఉండాలని కోరుతూ సీఐడీ డీఎస్పీ రవి కుమార్ ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని నోటీసుల్లో పేర్కొంది ఏపీ సీఐడీ.

AP CID Issues notices to Cherukuri Shailaja on Margadarshi chit fund case

 

ఈ నెల 29 లేదా 31 తేదీల్లో లేదంటే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఇల్లు లేదంటే ఆఫీసులో విచారణకు అందుబాటులో ఉంటే సరిపోతుందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో మార్గదర్శి మేనేజర్ లను సీఐడీ అరెస్టు చేసిన నేపథ్యంలో మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ల తరపు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు లాంటి బలవంతపు చర్యల నుండి మినహాయింపు ఇచ్చింది.


Share

Related posts

డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్ ల సూచన

Siva Prasad

బిగ్ బాస్ 4: కొత్త కెప్టెన్ అరియానా పై సీరియస్ అయిన మాస్టర్..!!

sekhar

Rahul Gandhi: ‘దేశానికి ఆయన ఆలోచనలు అవసరం’.. రాహుల్ గాంధీకి యావదాస్తి రాసి ఇచ్చిన డెహ్రాడూన్ వృద్ధురాలు

somaraju sharma