AP CID : గత తెలుగుదేశం Telugudesam ప్రభుత్వ Govt హయాంలో రాజధాని అమరావతి Capital Amaravathi ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని జగన్ Jagan సర్కార్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక పక్క పంచాయతీ ఎన్నికల్లో, తరువాత మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయ భారంతో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Chandra Babu కు జగన్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది.
ఇప్పటికే రాజధాని భూ సేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ CIT .. తాజాగా చంద్రబాబుకు 41 సీఆర్పిసీ కింద నోటీసులు జారీ చేశారు. సీఐడీ నోటీసును హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో సీఐడీ అధికారులు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ ల కింద సీ ఐ డీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబు తో పాటు 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణ తదితరులకు సీఐడీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హజరుకావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. దీనిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
రాజధాని ప్రకటనకు ముందే అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, వారి బంధువులు రాజధాని ప్రాంతంలో తక్కువ ధరలకు భూములను కొనుగోలు చేశారని వైసీపీ నేతలు తొలి నుండి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. టీ డీ పీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.